అక్షరశక్తి, హన్మకొండ : హన్మకొండ డాల్ఫిన్ చిల్డ్రన్ ఆస్పత్రిలో భూపాలపల్లి జిల్లా ఇస్సిపేటకు చెందిన జన్ను సాయి శ్రీ (6 ) మృతి చెందింది. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే పాప మృతి చెందిందని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ నెల 9న జ్వరంతో ఆస్పత్రిలో చిన్నారి సాయిశ్రీని చేర్పించారు. పాప ఆరోగ్యం బాగానే ఉందని, తొందరగానే కోలుకుంటుందని నమ్మిస్తూ వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, తమ పాప మృతికి డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.