- ఈరోజు విచారణకు రానున్న కేసు….
- కేయూ భూకబ్జా కేసులపై హైటెన్షన్….
అక్షరశక్తి, కేయూ క్యాంపస్ : కేయూ అధ్యాపక సంఘం, విద్యార్థి సంఘాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం కేయూ భూములపై విజిలెన్స్ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దీంట్లో భాగంగా ఇటీవల రెవెన్యూ మరియు ల్యాండ్ సర్వే ఆఫీసు అధికారులతో కలిసి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్. అధికారులు చేయించిన సర్వే రిపోర్టు ఆధారంగా వరంగల్ మున్సిపల్ ఆఫీసు అధికారులు కేయూ అసిస్టెంట్ రిజిస్ట్రార్ మరియు మిగితా వారి ఇంటి నెంబర్లను చూయిస్తూ నోటీసులు జారీ చేసింది. సెక్షన్ 254 కింద ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలని నోటీసులో పేర్కొంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా వున్నాయి.
సెక్షన్ 254 కింద డిప్యూటీ కమీషనర్, కాజీపేట సర్కిల్, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ వారు మరియు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ వారు సెప్టెంబర్ 2 న కేయూ పరిదిలో వున్న భూముల ఆక్రమణకు సంబంధించి బీసీ కాలనీ గుండ్ల సింగారం కుమారపల్లి లో వుంటున్న కొందరికి నోటీసులు జారీ చేశారు. వీరిలో 9 మంది హైకోర్టును ఆశ్రయించగా హైకోర్టులో ఈరోజు వీరి అభ్యర్థనపై వారి న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలను వినిపించనున్నారు. వరంగల్ మున్సిపల్ వారు ఇచ్చిన నోటీసులకు ఇదే నెల 5 న ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ఇచ్చిన సమాధానాన్ని పరిగణనలోకి తీసుకోవాలని, సమాధానాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఎటువంటి చర్యలు మున్సిపల్ వారు చేపట్టుకూడదని ఉత్తర్వులు వెలువరించాలని హైకోర్టును ఆశ్రయించిన 9 మందికి తాత్కాలిక ఊరట లభిస్తుందా లేదా వేచి చూడాల్సిందే.