అక్షరశక్తి, నర్సంపేట : నర్సంపేట పట్టణంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నర్సంపేట మున్సిపాలిటీ 9వ వార్డు సంజయ్ గాంధీ నగర్లో హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమానికి కౌన్సిలర్ రాయుడి కీర్తి దుష్యంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హజరయ్యారు. అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… వినాయకుడి ఆశీస్సులతో ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూత్ అధ్యక్షులు గొడిశాల అనిల్, వలస సత్యనారాయణ, బీఆర్ఎస్ పార్టీ కార్యదర్శి మొద్దు వేణు, ఉపాధ్యక్షులు భద్రు, కొలువుల గోపి, కొలువుల ప్రసాద్, ఇప్ప గణేష్, మండల అశోక్, కొలువుల ఎల్లయ్య, ఎడ్ల శివ, కొలువుల రాములు ఆరెల్లి అవినాష్ తదితరులు పాల్గొన్నారు.