అక్షరశక్తి, స్టేషన్ఘన్పూర్ : జనగామ జిల్లా చిల్పూరు మండలం వంగాలపల్లి రైల్వే గేటు వద్ద రైలుకింద పడి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారు. స్టేషన్ ఘనపూర్ మండలం శివునిపల్లి లోని సెయింట్ థామస్ స్కూల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థి కే రాజ్కుమార్ శుక్రవారం ఉదయం హాస్టల్ నుండి పారిపోయాడని తల్లిదండ్రులకు పాఠశాల యాజమాన్యం సమాచారం ఇచ్చి, పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే రైలుకింద పడి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్థి స్వగ్రామం జాఫర్గడ్ మండలం ఉప్పుగల్లు. ఈ ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది.