Thursday, September 19, 2024

హసన్ పర్తి మీడియా పాయింట్ నూతన కమిటీ ఎన్నిక

Must Read
  • అధ్యక్షుడిగా జక్కుల విజయ్ కుమార్
  • ప్రధాన కార్యదర్శిగా సింగారపు బాబు

అక్ష‌ర‌శ‌క్తి, హసన్ పర్తి : హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఆదివారం హసన్ పర్తి మండల మీడియా పాయింట్ సభ్యులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మీడియా పాయింట్ అధ్యక్షునిగా జక్కుల విజయ్ కుమార్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకోగా గౌరవ అధ్యక్షుడిగా ఎస్.డి అమ్మద్, ప్రధాన కార్యదర్శిగా సింగారపు బాబు, కోశాధికారిగా దాడి చిరంజీవి యాదవ్, ఉపాధ్యక్షులుగా పోగుల రాజకుమార్, సహాయ కార్యదర్శిగా రామంచ మధుకర్, సలహాదారులుగా దండుగుడం రాజకుమార్, వేల్పుల ఓదెలును ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మీడియా పాయింట్ అధ్యక్షుడు జక్కుల విజయకుమార్ మాట్లాడుతూ మండలంలోని జర్నలిస్టుల సమస్యల‌ను పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సందేల కిషోర్, దండుగుడుం రాజ్ కుమార్, వేల్పుల ఓదెలు, డి. చిరంజీవి, సింగారపు బాబు, ఆర్. మధుకర్, సందెల రాజు, బి రాజు, జె అభిషేక్, కే శ్రీకాంత్, వై కుమారస్వామి, ఆర్ దుర్గాప్రసాద్,చిర్ర సుమన్,రాజారపు బిక్షపతి, జి శ్రీనివాస్ దేవ్, పోగుల రాజకుమార్, జర్నలిస్టు మిత్రులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img