Friday, July 26, 2024

సీపీ అంబర్ కిశోర్ ఝాను కలిసిన కేయూ విధ్యార్థి నాయకులు

Must Read

అక్షరశక్తి, హన్మకొండ క్రైం: కాకతీయ యూనివర్సిటీ విధ్యార్థి సంఘాల నాయకులు వరంగల్ పోలీసు కమిషనర్ ను తన ఛాంబర్ లో కలిశారు.మొన్న నిరుద్యోగి ప్రవళిక ఆత్మహత్య చేసుకున్న సంఘటనలో వారి కుటుంబానికి న్యాయం చేయాలని శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థి నాయకులపై స్థానిక భారత రాష్ట్ర సమితి నాయకులు గుండాలుగా మారి దాడి చేశారని మరియు స్థానిక సీఐ పుల్యాల కిషన్ ఎస్సై జక్కుల పరమేశ్వర్, తోట మహేందర్ రెడ్డి లు విద్యార్థి నాయకులను పరుష పదజాలంతో తిట్టుకుంటూ ముక్కుపై పిడిగుద్దులు గుద్దడం వలన గిరిజన శక్తి విద్యార్థి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుగులోతు రాజు నాయక్ ముక్కు ప్యాక్చర్ అయింది .వెంటనే హన్మకొండ లోని గౌడ రమేష్ ent హాస్పిటల్ కు తరలించి సర్జరీ చేయించడం జరిగింది., సీఐ,సబ్ ఇన్స్పెక్టర్లు తీవ్రంగా దాడి చేసి గాయపరిచారని వారిని వెంటనే సస్పెండ్ చేయాలని స్థానిక సర్పంచి మరియు ఎంపీపీ కాట్ల భద్రయ్య పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో పోలీసుల చేతిలో గాయపడిన విధ్యార్థి నాయకుడు గుగులోతు రాజు నాయక్ విధ్యార్థి సంఘ నాయకులు విజయ్ కన్నా, మొగిలి వెంకట్ రెడ్డి(పి.డి.యస్.యూ) మెడ రంజిత్(టి.జి.వి.పి) బొట్ల మనోహర్(బి.యస్.ఫ్) బంధిగా రాకేష్(యూత్ కాంగ్రెస్) జగన్, భూక్య వెంకట్,బానోతు దేవేందర్, తదితరులు పాల్గొన్నారు

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img