అక్షరశక్తి, హసన్పర్తి : హసన్పర్తి మండలం అనంతసాగర్ గ్రామంలో సర్పంచ్ బండ అమిత జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కంటి వెలుగును బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గురువారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజల ఆరోగ్యం కోసం కంటివెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అన్నారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ సునీత, జెడ్పీటీసీ సునీత, వైఎస్ ఎంపీపీ బండ రత్నాకర్ రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు బండి రజనీ కుమార్, రైతుబంధు మండల కోఆర్డినేటర్ అంచూరి విజయ్ కుమార్, ఎంపీడీవో రామకృష్ణ, పంచాయతీ కార్యదర్శి కల్పన, వైద్యాధికారులు, సిబ్బంది, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.