అక్షరశక్తి, భూపాలపల్లి : గణపురం మండల కేంద్రంలోని పెద్దమ్మ కుంట సమీపంలోని పేకాట స్థావరం పై పోలీసుల బుధవారం దాడులు నిర్వహించారు. 11మందిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి వారి వద్దనుండి 9 సెల్ ఫోన్లు, 7 మోటార్ సైకిళ్లు, రూ.30,460లు నగదు స్వాధీనం చేసుకున్నట్టు గణపురం ఇంచార్జ్ ఎస్ ఐ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. మండల కేంద్రానికి చెందిన పల్నాటి రాజు, పెండ్యాల తిరుపతి, బొడిగె శివ, ఆరుముళ్ళ ప్రభాకర్, ఉడుత దేవేందర్, నూనేగంటి రజనీకాంత్, పోషణ శంకర్, వాంకుడోతు సతీష్, మచ్చిక రక్షిత్, షేక్ ఆరిఫ్, బండి శీనులు ఉన్నట్లు తెలిపారు.