- 1000 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం
- 20 లీటర్ల గుడుంబా స్వాధీనం
అక్షరశక్తి, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం లోని రాముల తండా గ్రామ శివారు ఫుల్ సింగ్ తండాలో పోలీసు,ఎక్సైజ్ శాఖ అధికారులు సంయుక్తంగా బుధవారం గుడుంబా స్థావరాలపై దాడులు నిర్వహించారు.ఈ దాడుల్లో వెయ్యి లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసి 20 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకున్నట్టు సిఐ బిక్షపతి, ఎస్ఐ సతీష్ తెలిపారు. కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నామని తెలిపారు. దాడుల్లో పోలీస్,ఎక్సైజ్ శాఖ కానిస్టేబుల్స్ తదితరులు పాల్గొన్నారు.
Must Read