- సర్పంచ్ సంద వీరన్న
అక్షరశక్తి, మహబూబాబాద్ : ప్రతి ఒక్కరూ మత సామరస్యం పెంపొందించుకోవాలని కంబాలపల్లి సర్పంచ్ సందవీరన్న అన్నారు. గ్రామంలో రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలకు ఆయన సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లిం సోదరులు జరుపుకునే ఈ పండుగ కు మనవంతుగా స్పందించి సహాయం చేయడం వలన వారిలో మానవత్వం పరిమలించి మళ్ళీ వాళ్లు కూడా హిందువుల పండుగను సోదరపండుగగా భావిస్తారని తెలిపారు. దాని వలన మత సామరస్యం బల పడుతుందన్నారు. మనుషులు అంతాఒకటే అని ఐక్యత గా జీవించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ వేణు, ముత్యాల వెంకన్న, ఆకుల శేఖర్, పోలేపొంగు ఎల్లయ్య, దాసరి మోహన్, యశ్వంత్, యాకన్నా, సప్పిడి సైదన్న, సాగర్, వీరన్న, బిక్షము తదితరులు పాల్గొన్నారు.
Must Read