అక్షరశక్తి మహబూబాబాద్: బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకై తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ వివిధ శాఖల సహకారంతో ప్రతి ఏటా రెండుసార్లు జనవరి నెలలో ఆపరేషన్ స్మైల్ మరియు జూలై నెలలో ఆపరేషన్ ముస్కాన్ వంటి కార్యక్రమాలను నిర్వహించి అనేక మంది బాలకార్మికులకు విముక్తి కల్పించడం జరుగుతుంది అన్నారు. ఇందులో భాగంగానే ఈ సంవత్సరం అపరేషన్ ముస్కాన్ -ఎక్స్ అడిషనల్ ఎస్పీ జోగుల చెన్నయ్య గారి నేతృత్వంలో 20 మంది బాల కార్మికులకు విముక్తి కల్పించడం జరిగింది. ఇందులో 2 మంది అమ్మాయిలు ఉండగా 18 మంది బాలురు ఉన్నారు.. వారిని సీడ్బ్లుసీ, డిసీపిఓ వారికి అప్పగించడం జరిగిందని, తదుపరి పిల్లలను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు హాజరు పరచి పిల్లలకు, వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందన్నారు. బాలలను కార్మికులుగా పెట్టుకున్న యజమానులపై కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ మాట్లాడుతూ.. ఇప్పటికీ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్లో బాల కార్మిక వ్యవస్థ ఒకటని, కార్మికులుగా పనిచేసే 5 నుంచి 14 సంవత్సరాలలోపు పిల్లల్ని బాలకార్మికులుగా పరిగణిస్తారని, పిల్లలు ఎవరైనా బాలకార్మికులుగా ఉన్నారంటే వారి ప్రాథమిక హక్కులకు భంగం కలిగినట్లేనని, పరిశ్రమలు, వ్యవసాయం, ఇటుక బట్టీలు, నిర్మాణ రంగం, కర్మాగారాలలో, హోటల్స్లో, రైల్వే, బస్సు స్టేషన్లు, బిక్షాటన, సేవలు సహా అనేక రంగాల్లో బాలలు కార్మికులుగా పనిచేస్తున్నారని, బాల కార్మికులుగా కొనసాగినవారు. వీరికి సరైన విద్య లేకపోవడంతో ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయని, పోటీతత్వంతో నిండిన సమాజంలో అన్నిరకాలుగా వెనుకబడిపోతున్నారన్నారు. పెద్దవారయ్యాక సరైన ఉపాధి దొరకని కారణంగా పలువురు నేరాలకు పాల్పడుతున్నారని, ఉపాధి మార్గాలు వెతుక్కునేందుకు సరైన మార్గదర్శనం, ఆర్థిక తోడ్పాటు లేకపోవడం, నైపుణ్యాలు లేని వంటి కారణాల వల్లే ఇలా మారుతున్నారని, నేటి బాలలే రేపటి పౌరులని..! చిన్నారులే దేశ ప్రగతికి సోపానాలని. కానీ అభివృద్ధిలో పరుగులు పెడుతున్న నేటి హైటెక్ యుగంలోనూ ఇంకా వెట్టిచాకిరి వ్యవస్థ చిన్నారుల బాల్యాన్ని చిదిమేస్తోందిని. బాలకార్మిక వ్యవస్థ.. చిట్టి చేతులను చిత్ర హింసలు పెడుతోందన్నారు. జిల్లాలో ఎక్కడైనా బాలకార్మికులు కనబడితే వెంటనే డయల్ 100 కి గాని, 1098 చైల్డ్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్కు గాని ఫోన్ చేసి సమాచారం అందించాలని తెలియజేశారు.