Thursday, September 19, 2024

బాలికల సదనం సందర్శించిన కలెక్టర్

Must Read

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : రాఖీ పౌర్ణమి సందర్భంగా సోమవారం ప్రభుత్వ బాలికల సదననాన్ని హ‌న్మ‌కొండ‌ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య సందర్శించారు. ఈ సందర్భంగా బాలికలు కలెక్టర్ కు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు, ఈ సందర్భంగా పిల్లలందరికీ నోటు పుస్తకాలు, బ్లాంకెట్స్, ఫ్రూట్స్ పంపిణీ చేసారు.
అనంతరం సదనంలో విద్యార్థినీలకు అందిస్తున్న సేవలు, వసతి వివరాలు, ప్రస్తుతం ఆశ్రయం పొందుచున్న వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వెకెన్సి ఉద్యోగుల వివరాలు నివేదిక రూపంలో అందిస్తే ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన నియామకం చేపట్టాలని జిల్లా సంక్షేమ అధికారికి, సూపరింటెండెంట్ కు ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి బి, రాజమని, సూపరింటెండెంట్ ఎం కల్యాణి, జిల్లా బాలల పరిరక్షణ ఇన్చార్జి అధికారి ఎస్ ప్రవీణ్ కుమార్, యూడిసి వి వెంకట్ రాం, సింధు రాణి, డివి ఆక్ట్ కౌన్సిలర్ పావని, ఎం మౌనిక, ఎ సతీష్ కుమార్, జి సునీత, నగేష్, చైతన్య, సీత, శ్రీలత, గౌతమి, త్రివేణి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img