అక్షరశక్తి, భీమదేవరపల్లి: అప్పుల బాధ భరించలేక క్రిమి సంహారక మందు తాగి యువకుడు ఆత్మహత్య చే సుకున్న ఘటన భీమదేవరపల్లి మండలం కొప్పూరు గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం కొప్పుర్ గ్రామానికి చెందిన దాట్ల మొగిలి చిన్న కుమారుడు దాట్ల ప్రవీణ్ (38) తనకున్న 20 గుంటల భూమితోపాటు మరో 1. 20 గుంటల భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఈ మధ్యకాలంలో తనకున్న భూమిలో వ్యవసాయ బావి తవ్వగా అందులో నీళ్ళు పడలేదు. తిరిగి మళ్లీ వేరే దగ్గర బావి తవ్వించిన కూడా నీళ్ళు పడలేదు. దీంతో కొంత అప్పు అయ్యింది. అంతేగాక తనకి గతంలో కూడా కొంత అప్పు ఉండేది దాన్ని మనసులో పెట్టుకొని సోమవారం ఉదయం పొలం వద్ద క్రిమి సంహారక మందు తాగి పడిపోగా పక్క చేనులో ఉన్న వారు గమనించి హుటాహుటిన ప్రవీణ్ను ముల్కనూరులోని ప్రై వేట్ దవాఖానలో చేర్పించారు. మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎంకి తరలించగా, చికిత్స పొందు తూ మంగళవారం ఉదయం మృతి చెందాడు. తండ్రి దాట్ల మొగిలి ఫిర్యాదు మేరకు ములకనూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.