లక్షా నూట పదహారు రూపాయలకు దక్కించుకున్న వోరుగంటి వీరారెడ్డి- పద్మావతి
అక్షరశక్తి, హన్మకొండ: కేఎల్ఎన్ గజానన మండలి ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు కన్నులపండువగా కొనసాగాయి. చివరి రోజు బుధవారం నిమజ్జనం సందర్భంగా నిర్వాహకులు లడ్డూ వేలం నిర్వహించగా, కేఎల్ఎన్ రెడ్డి కాలనీ అధ్యక్షులు వోరుగంటి వీరారెడ్డి- పద్మావతి దంపతులు లక్షా నూట పదహారు రూపాయలకు దక్కించు కున్నారు. అనంతరం దంపతులిద్దరినీ కేఎల్ఎన్ గజానన మండలి నిర్వాహకులు, కాలనీ పెద్దలు అభినందించారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా పెరిక కుల సంఘం అధ్యక్షులు సోమిశెట్టి శ్రీనివాస్, ప్రేమ్ దోషి (విగ్రహ ధాత) గుజ్జ రాంగోపాల్ రెడ్డి, మాధవరెడ్డి, వెంకన్న, పోలాడి కిషోర్, ముత్తినేని బిక్షపతి, పూ జారి ఆదిత్య, నన్నపునేని లోకేష్, విష్ణు, వెనిషెట్టి అభినవ్, వాకా సాయి, వాకా అనిల్, కార్తిక్, విజయ్, రాజీవ్, సంతు, రాజు, ఫని, ప్రభాకర్ రాజు, సమ్మిరెడ్డి, లక్ష్మారెడ్డి, అచ్చ భిక్షపతి, బాదె బాబురావు తదితరులు పా ల్గొన్నారు.
Must Read