Saturday, July 27, 2024

ఘోర రోడ్డు ప్రమాదం

Must Read

ఓకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతి

ఒకరు రైల్వే ట్రైనీ టీసీ.. మరొకరు సాఫ్టువేర్..

ఘటన స్థలంలో మిన్నంటిన తల్లి దండ్రుల ఆర్తనాదాలు

ప్రమాద ఘటనను పరిశీలించిన ఇన్ స్పేక్టర్ ప్రవీణ్ కుమార్..

అక్షరశక్తి – హసన్ పర్తి : హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండలంలోని అనంతసాగర్ క్రాస్ వద్ద సోమవారం తెల్లవారు ఝామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్న దమ్ములు అక్కడికక్కడే మృతి చెందారు. వారిలో ఒకరు పెద్దవాడు శివరాం (24) రైల్వే ట్రైనీ టికెట్ కలెక్టర్ కాగా రెండవ వాడు హరికృష్ణ (23) సాప్ట్ వేర్. ఇద్దరు ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో బిడ్డలను కోల్పోయిన ఆ తల్లిదండ్రుల ఆర్తనాదాలు అక్కడి వారిని కన్నీరు పెట్టించింది. మృత్యువుకు వీడని అన్నదమ్ముల బంధాన్ని చూసిన వారు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘోర ప్రమాదంలో స్థానికుల్లో కలవరం రేపింది. విషయం తెలిసిన ఎల్కతుర్తి ఇన్ స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, ఎస్సై పరమేష్, హసన్ పర్తి ఎస్సై ధేశిని విజయ్ కుమార్ పోలీసు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాద స్థితిని పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు చుట్టుపక్కల ప్రాంతాలలో ఉన్న సీసీ టీవీ పుటేజిని పరిశీలిస్తున్నారు.

వివరాల్లోకి వెళితే… కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం కందుగులకు చెందిన ఇప్పాలపల్లి మనోహర్ కందుగులలో హోటల్ నడుపుకుంటూ తన ఇద్దరు పిల్లలను కష్టపడి పెద్ద చదువులు చదివించి ప్రయోజకులను చేశాడు. పెద్దవాడు శివరాం (24) ఇటీవలే రైల్వేలో టికెట్ కలెక్టర్ కొలువుకు ఎంపికై శిక్షణ పొందుతున్నాడు. రెండవ వాడు హరికృష్ణ (23) హైదరాబాద్ లో ఓ ప్రైవేటు కంపెనీలో సాఫ్టు వేర్ గా పనిచేస్తున్నాడు. వారిద్దరూ ప్రయోజకులుగా ఎదగడంతో గ్రామంలో ఆ కుటుంబానికి మచి పేరుంది. ఇక త్వరలోనే ఇద్దరికీ పెళ్లి చేద్దామనుకున్న ఆ తల్లి దండ్రుల ఆశలు సోమవారం అనంతసాగర్ క్రాస్ రోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంతో అడియాశలుగానే మిగిలాయి. సోమవారం శివరాం, హరికృష్ణలు హైదరాబాద్ లో కొలువులో చేరడానికి కందుగుల నుంచి తెల్లవారు ఝామున 5 గంటలకు తమ ద్విచక్రవాహనం పై హైదరాబాద్ బయలుదేరారు. మార్గమధ్యలో అనంతసాగర్ క్రాసు రోడ్డు వద్ద తెల్లవారుఝామున 5:39 గంటలకు ఎదురుగా మరోవాహనాన్ని ఓవర్టేక్ చేస్తున్న వాహనం వీరు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని వేగంగా ఢీ కొట్టినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ దుర్ఘటనలో ఓకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద ఘటన తెలుసుకున్న ఎల్కతుర్తి ఇన్ స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, ఎస్సై పరమెష్, హసన్ పర్తి అడ్మిన్ ఎస్సై దేశీని విజయ్ కుమార్, కానిస్టేబుళ్లు దాడి రాజు, రమేష్ లు మృతుల తల్లిదండ్రులకు సమాచారం అందించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం మార్చురీకి తరలించారు. అనంతరం మృతుల తండ్రి మనోహర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img