Friday, July 26, 2024

ఉమ్మడి వరంగల్ తహశీల్దార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా విశ్వప్రసాద్?

Must Read

అక్షరశక్తి , వరంగల్: వరంగల్ జిల్లా తహశీల్దార్ అసోసియేషన్ అధ్యక్షులుగా నర్సంపేట తహశీల్దార్ విశ్వప్రసాద్ ఎన్నిక కానున్నట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక రెవెన్యూ లో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి.ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత రెవెన్యూ లో మార్పులపై చర్చ జరుగుతున్నది..ఈ నేపథ్యంలో ఈ ఆదివారం హనుమకొండ లో రెవెన్యూ ఉద్యోగుల రాష్ట్ర స్థాయి ఆత్మీయ సమ్మేళనం జరుగుతున్నది. ఇందులో భాగంగా ఈ సమావేశంలో భవిష్యత్ లో రెవెన్యు ఉద్యోగుల కార్యాచరణపై చర్చ జరుగుతోంది..ఈ సందర్భంలో వుమ్మడి వరంగల్ జిల్లా తహశీల్దార్ అసోసియేషన్ అధ్యక్షుడు నియామకం జరగనున్నట్లు తెలుస్తుంది.ఈ సమావేశానికి టీ జీ టీ ఏ వ్యవస్థాపక అధ్యక్షుడు లచ్చిరెడ్డి తదితర రాష్ట్ర తహశీల్దార్ నాయకులు హాజరుకానున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img