అక్షరశక్తి, వరంగల్: పార్లమెంటు ఎన్నికల ముంగిట బీఆర్ఎస్ పార్టీకి ఊహించని ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఇద్దరు సిట్టింగ్ ఎంపీలు పార్టీని వీడి బిజెపిలో చేరారు. తాజాగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా పార్టీకి భారీ షాక్ తగులుతుంది వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కూడా బిజెపిలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు అత్యంత విశ్వాసనీయ సమాచారం. మార్చి 4వ తేదీన ఆయన కమలం తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ బిజెపి టికెట్ ను ఆరూరికి ఇచ్చేందుకు పార్టీ అధిష్టానం ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.