అక్షరశక్తి, వరంగల్ : పార్లమెంట్ ఎన్నికల ముంగిట బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ ఎంపీలు కాంగ్రెస్, బీజేపీలలో చేరారు. తాజాగా, వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ పసునూరి దయాకర్ శుక్రవారం ఉదయం సీఎం రేవంత్రెడ్డిని కలిసి, పుష్పగుచ్ఛం అందించారు. ఎంపీ పసునూరి దయాకర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. ఈ పరిణామాలతో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి రోజురోజుకూ దయనీయంగా మారుతోంది. వరంగల్ ఎంపీ టికెట్ను స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కేటాయించడంపై పలువురు నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సిట్టింగ్ బీఆర్ఎస్ ఎంపీ పసునూరి దయాకర్ సీఎం రేవంత్రెడ్డిని కలవడం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. కాగా, హైదరాబాద్లో ఫైన్ ఆర్ట్స్ చదువుకునే రోజుల్లో రేవంత్రెడ్డి, పసునూరి దయాకర్లిద్దరూ బ్యాచ్మెట్స్ కావడం గమనార్హం.