Thursday, September 19, 2024

పోలీస్ చట్టాలపై పట్టు సాధించాలి- వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు.

Must Read

అక్ష‌ర‌శ‌క్తి వ‌రంగ‌ల్: వరంగల్ పోలీస్ కమిషనర్ గురువారం మడికొండ లోని పోలీస్ శిక్షణా కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ ముందుగా టైనీ కానిస్టేబుళ్లకు పోలీస్ చట్టాలను బోధించే తరగతి గదులను సందర్శించి అధికారులు భోధన పద్దతి పరిశీలన చేశారు. అనంతరం పోలీస్ కమిషనర్ కొద్ది సేపు ముచ్చటించి ఇప్పటి వరకు అధికారులు భోధించిన అంశలపై ట్రైనీ కానిస్టేబుళ్ళని కమిషనర్ ప్రశ్నలు అడిగారు. అనంతరం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ పోలీస్ భోధనకు సంబందించి ప్రతి అంశం పై పట్టు వుండాలని, తద్వారా విధులు నిర్వహించే సమయం ఎదురయ్యే సమస్యలను సులభంగా అదిగమించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ జితేందర్ రెడ్డి, రమణబాబు, ఇండోర్, అవుట్ డోర్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img