అక్షరశక్తి, పర్వతగిరి: బుధవారం రోజు ఎంపీడీఓ మాలోతు శంకర్ నాయక్ స్వచ్ఛత హీ సేవా 2024 కార్యక్రమంలో భాగంగా మోడల్ స్కూల్ లో విద్యార్థులకు స్వచ్ఛత పైన అవగాహన కల్పించి మానవహారం నిర్వహించారు. అలాగే విద్యార్థులతో స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం పంచాయతీ కార్యదర్శులతో స్వచ్ఛత హీ సేవా 2024 కార్యక్రమంలో షెడ్యూల్ ప్రకారం రోజు వారిగా చేపట్టవలసిన కార్యక్రమాలు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మాలోతు శంకర్ నాయక్, ఎంపీవో పాక శ్రీనివాస్, ఎంఎన్ఓ లింగారెడ్డి, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్, ఏపిఓ సుశీల్ కుమార్, ఎస్బియం కో-ఆర్డినేటర్ శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.