అక్షరశక్తి, పరకాల : హనుమకొండ జిల్లా పరకాలకు చెందిన కొక్కిరాల రవీందర్ రావు కుమారుడు రాకేష్ రావు తన ఐటీ సంస్థ డిజియోద మీడియా ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి రూ.5లక్షల చెక్కును విరాళంగా అందజేశారు. రాకేష్ రావు మాట్లాడుతూ… చల్లా చారిటబుల్ ట్రస్ట్ నుంచి కొద్ది రోజులుగా పరకాల నియోజకవర్గంలోని పరకాల పట్టణం, గీసుకొండ మండలంలో నిరుద్యోగ యువతీ యువకులకు ఫ్రీ కోచింగ్, ఉచిత భోజనం మెరుగైన వసతులను కల్పిస్తున్నారని, తన వంతు సాయంగా రూ.5లక్షల చెక్ ను అందచేశానన్నారు. ఈ సందర్భంగా పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ… రాకేష్ రావు ఐటీ డిజియోద సంస్థను పరకాల పట్టణంలో ఏర్పాటు చేసి 160 మందికి ఫుల్టైమ్ ఉద్యోగాలు ఇచ్చారన్నారు. చుట్టు పక్కల గ్రామాలకు చెందిన 400మందికి ప్రాజెక్టు బేసిస్లో ఉపాధి కల్పిస్తున్నారని అభినందించారు.ఈ సందర్భంగా వారికి శాలువా కప్పి అభినందించారు. రానున్న రోజులలో పరకాల యువతకు ఎక్కువ ఉద్యోగాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పుల్లూరు తిరుపతి రావు పాల్గొన్నారు.