కమలాపూర్ మండలంలో కలకలం
అక్షరశక్తి, కమలాపూర్: తన కూతురు చావుకి కారకుడు అనే అనుమానంతో యువకుడిని కత్తితో నరికి చంపా డు ఓ తండ్రి. ఈ ఘటన హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని మదన్నపేట గ్రామంలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు… వారం రోజుల క్రితం గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థిని కనుకుంట్ల అక్షయ ఇంటి నుంచి పాఠశాల వెళ్లొచ్చి వాంతులు, విరోచాలతో తీవ్ర అనారోగ్యం పాలయింది. దవాఖానకు తరలించగా అనుమానాస్పదంగా మృతిచెందింది. కాగా, హన్మకొండలోని పాఠశాలలకు ఆ రోజు బైక్పై తీసుకెళ్లిన మదన్నపేట గ్రామానికి చెందిన గుండపు రాజు (23) వల్లే తన కూతురు చనిపోయిందని తండ్రి భావించాడు. దీంతో అతడిపై ప్రతీకారం తీర్చుకునేందుకు అదును కోసం ఎదురుచూశాడు. ఈక్రమంలోనే శనివారం ఉదయం గుండపు రాజు(23)ను అక్షయ తండ్రి కనుకుంట్ల లెవేందర్ కొబ్బరి బోండాలు నరికే కత్తితో నరికాడు. దీంతో అతడు ఘటనా స్థలంలోనే మరణించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు లేవేందర్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Must Read