- నాయిని స్థానికుడు కాదు.. నా కోసం పనిచేస్తాడు
- డీసీసీబీ మాజీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి
- కాజీపేటలో హాత్ సే హాత్ యాత్ర
అక్షరశక్తి, కాజీపేట : రానున్న ఎన్నికల్లో వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచే పోటీ చేసి, కాంగ్రెస్ జెండా ఎగురవేస్తానని ఉమ్మడి వరంగల్ జిల్లా డీసీసీబీ మాజీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం వరంగల్ ఫశ్చిమ నియోజకవర్గం కాజీపేట 63వ డివిజన్లో హాత్ సే హాత్ జోడో యాత్ర చేపట్టారు. యాత్ర చివరలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో వర్గాలు ఉన్నాయా..? అంటూ ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఆయన ఇలా సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం హన్మకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగుతున్న నాయిని రాజేందరెడ్డి స్థానికుడు కాదు. ఈ ప్రాంతంతో ఆయనకు సంబంధం లేదు. నాది ఈ ప్రాంతం. ఇక్కడి ప్రజల కష్టసుఖాలు నాకు తెలుసు. వాళ్లకు ఏం కావాలో.. వారి సమస్యలు ఎలా పరిష్కరించాలో నాకు తెలుసు. నాయిని కూడా నా కోసం పనిచేస్తాడు. అవసరమైతే రెండు మూడు కోట్లు కూడా ఖర్చు పెడుతాడు. నా గెలుపు కోసం పనిచేస్తాడు. ఎలాంటి అనుమానాలు అవసరం లేదు. వరంగల్ పశ్చిమ టికెట్ నాదే.. గెలుపు నాదే… అంటూ జంగా రాఘవరెడ్డి స్పష్టం చేశారు. రాఘవరెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి.
Must Read