అక్షరశక్తి, పరకాల : తెలంగాణలో ఎనిమిది మంది బిజెపి ఎంపీలను గెలిపించినందుకు రాష్ట్రానికి ప్రత్యేక బడ్జెట్ లో నిధులేమైన కేటాయిస్తారని ఆశపడ్డ ప్రజలకు మోడీ ప్రభుత్వం మొండి చేయి చూపెట్టిందని పరకాల కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కొయ్యడ శ్రీనివాస్ అన్నారు. బుధవారం పరకాల పట్టణంలోని బస్టాండ్ కూడలిలో కొయ్యడ శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాస్తారోకో, కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మళ్ళీమళ్ళీ మోడీ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను మోసం చేస్తూనే ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో సమన్వయ కమిటీ సభ్యులు సోదా రామకృష్ణ, బొచ్చు అనంత్ ఎండి రంజాన్ అలీ, చిన్నాల గోనాథ్, ఒంటరి రామ్మూర్తి, మెరుగు శ్రీశైలం, చందుపట్ల రాఘవరెడ్డి, మడికొండ శ్రీనివాస్, కౌన్సిలర్లు పంచగిరి జయమ్మ, మడికొండ సంపత్, నలేళ్ల అనిల్, ఏకు రాజు, పట్టణ ప్రధాన కార్యదర్శి పబ్బ శ్రీనివాస్, సదన్ కుమార్, బొమ్మ కంటి చంద్రమౌళి, జాఫర్ రిజివి, దార్న వేణుగోపాల్, గడ్డం శివ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇర్ల చిన్ని, పసుల విజయ, లక్కం వసంత, కోమల, ఎండీ అలీ, గొట్టే రమేష్, దుప్పటి రాజేష్, మార్క రజినీకాంత్, బొచ్చు జెమినీ, బొచ్చు భాస్కర్, సంపత్, సాదిక్ పాషా, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు