అక్షరశక్తి, హన్మకొండ: వృత్తిలో నైపుణ్యం ప్రదర్శించిన పలువురు ఆర్టీసీ ఉద్యోగులకు ప్రగతి చక్రం అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు. హనుమకొండ డిపో మేనేజర్ భూక్యా ధరమ్ సింగ్ ఆధ్వర్యంలో శనివారం డిపో ఆవరణలో జరిగిన కార్యక్రమంలో డిఎం మాట్లాడుతూ డ్యూటీలో అధిక ఆదాయం తెచ్చి, సంస్థను మరింత ముందుకు తీసుకొని పోవాలన్నారు. ఇంధనాన్ని పొదుపుగా వాడి డిపోను ప్రథమ స్థానంలో నిలపాలని కోరారు.
ఎలాంటి బ్రేక్ డౌన్ లేకుండా బస్సులను మెయింటైన్ చేసి ప్రయాణికుల మన్ననలూ పొందాలని కోరారు. లక్షే లక్ష్యం కార్యక్రమంలో భాగంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల విజేతలకు, విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు ఈ సందర్భంగా బహుమతుల ప్రదానం చేశారు. కార్యక్రమంలో ట్రాఫిక్ సూపర్వైజర్ నజియా సుల్తానా, మెకానిక్ సూపర్వైజర్ వి చంద్రశేఖర్ ఉద్యోగులు పాల్గొన్నారు.