అక్షర శక్తి, హాసన్ పర్తి : హసన్పర్తి మండలం కేంద్రంలో ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో హసన్పర్తి సి.ఐ సురేష్ ఆధ్వర్యంలో సుమారు వందమంది విద్యార్థులకు డ్రగ్స్ మత్తు పదార్థాలు వల్ల కలిగే నష్టాలపై, డ్రగ్స్ వాడడం వల్ల, వాళ్ళ యొక్క మానసిక పరిస్థితులపై, సమాజంలో డ్రగ్స్ వల్ల ఎంతమంది జీవితాలు నష్టపోతున్నారు అనే విషయాలపై….. అదేవిధంగా సైబర్ క్రైమ్స్ నేరాలు ఏ విధంగా జరుగుతున్నాయి, ప్రజలు ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి అనే విషయాలపై క్లుప్తంగా అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమంలో జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ లెక్చరర్లు పాల్గొన్నారు.