అక్షరశక్తి హనుమకొండ జిల్లా: వరంగల్ కమిషనరేట్ హనుమకొండ సుబేదారి పిఎస్ పరిధిలోని నక్కలగుట్ట శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులకు స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో సొసైటీలో జరిగే సైబర్ క్రైమ్, గుడ్ టచ్, బాద్ టచ్, ఆపదలో దయాల్ 100, మైనర్ డ్రైవింగ్, తదితర సోషల్ మీడియా విషయాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సుబేదారి ఎస్ఐ ఘాలీబ్, పిసీ అశోక్, పీఎస్ సిబ్బంది, విద్యార్ధులు, తదితరులు పాల్గొన్నారు.