అక్షరశక్తి డెస్క్: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి మరోసారి స్థల పరిశీలన చేశారు. విగ్రహ ఏర్పాటు ప్రదేశానికి అనుగుణమైన డిజైన్ కూర్పుపై అధికారులతో సమావేశం జరిగింది. అనంతరం డిప్యూటీ సీఎం పలువురు ప్రజా ప్రతినిధులతో కలిసి సచివాలయం ఆవరణలో అనువైన స్థలంగా భావిస్తున్న ప్రధాన ద్వారం ముందు ప్రాంతాన్ని సీఎం పరిశీలించారు.