అక్షరశక్తి, హాసన్ పర్తి: వరంగల్ లోని శ్రీ భద్రకాళి దేవాలయానికి విచ్చేసిన టిపిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ, స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డితో కలిసి ఆలయంలో ఆలయ ప్రధాన అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, వేదమంత్రాలతో ఆశీర్వచనం చేశారు. ఈ కార్యక్రమంలో వరంగల్ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, రేవూరి ప్రకాశ్ రెడ్డి, గండ్ర సత్యనారాయణ రావు, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి, వరంగల్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ- రాజేశ్వరరావు, ప్రజాప్రతినిధులు మాజీ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, బ్లాక్ మండల, పట్టణ, డివిజన్, స్థాయిల నాయకులు, కార్యకర్తలు, మహిళా యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు