అక్షరశక్తి, వరంగల్: కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు జి కిషన్ రెడ్డి సమక్షంలో భారతీయ జనతా పార్టీలో వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ చేరారు. ఇటీవలే బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి అరూరి రమేష్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. పార్లమెంటు ఎన్నికల్లో వరంగల్ బిజెపి టికెట్ అరూరికే ఖాయమని తెలుస్తోంది.