అక్షరశక్తి, హన్మకొండ క్రైం : ఓ వాహనదారుడి నుంచి లంచం తీసుకుంటూ పట్టుబడిన హన్మకొండ ట్రాఫిక్ ఎస్సై డేవిడ్ను వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రెండు రోజుల కిందట ములుగు రోడ్డు వద్ద ట్రాఫిక్ ఎస్సై డేవిడ్ ఓ వాహనదారుడి నుంచి లంచం తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈనేపథ్యంలో వెంటనే ఆయనను హెడ్ క్వార్టర్స్కు తరలించి, విచారణ చేపట్టారు. ట్రాఫిక్ ఎస్సై లంచం తీసుకున్నట్లు నిరూపణ కావడంతో సీపీ అంబర్ కిశోర్ఝా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, మొదటి నుంచీ డేవిడ్ పనితీరుపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు ఉన్నాయి.