Saturday, May 18, 2024

ఏసీబీకి చిక్కిన కేయూ అసిస్టెంట్ రిజిస్ట్రార్‌

Must Read

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం: కాకతీయ యూనివర్సిటీలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఏఆర్ కిష్టయ్య ఏసీబీ వ‌ల‌కు చిక్కారు. రూ. 50 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీపీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. విద్యార్థుల ట్యూషన్ ఫీజులు, ఇతర రుసుముల స్వీకరణలో జరిగిన రూ. 3 కోట్ల కుంభకోణంపై కమిటీ విచారణ చేస్తున్న సయమంలోనే కేయూ వీసీ రమేష్ కిష్టయ్యను క్యాంపస్‌కు మార్చారు. న్యాక్ కోసం కేటాయించిన రూ.10 కోట్ల బిల్లుల్లో చేతి వాటం కోసమే కిష్టయ్యను క్యాంపస్‌కు వీసీ బదిలీ చేయించారని గతంలో అనేక ఆరోపణలు వచ్చాయి.

యూనివర్సిటీలో కీలకైన నాలుగు కార్యాలయాలకు కిష్టయ్య ఒక్కడినే అసిస్టెంట్ రిజిస్ట్రార్‌గా వీసీ ర‌మేష్‌ నియమించారనే ఆరోపణలు బ‌లంగా ఉన్నాయి. న్యాక్ సందర్భంగా వర్సిటీలో రోడ్లు, హాస్టళ్లు, ఇతర బిల్డింగ్‌ల‌ కోసం రూ.10 కోట్ల కేటాయించారు. వీటిలో కమీషన్ల కోసమే బిల్డింగ్ డివిజన్, పబ్లికేషన్స్ సెల్, హాస్టల్ ఆఫీస్‌తోపాటు యూనివర్సిటీ ఆడిట్ ఆఫీస్‌కు కూడా కిష్టయ్యనే అసిస్టెంట్ రిజిస్ట్రార్‌గా నియమించారు. ఒక్క హాస్టల్ లోనే పాలు అమ్మే వ్యాపారి దగ్గరి నుంచి రూ. 50 వేలు లంచం తీసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇంకా దీని వెనుక పెద్ద పెద్ద తిమింగలాలు ఉన్నాయనే అనుమానంతో ఏసీబీ విచారణ జరుపుతోంది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img