Saturday, May 18, 2024

రోడ్డు ప్ర‌మాదంలో ఒక‌రి దుర్మ‌ర‌ణం

Must Read

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం : కాక‌తీయ యూనివ‌ర్సిటీ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో కేయూ ఫస్ట్ గేట్ ముందు బుధ‌వారం సాయంత్రం జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో బిల్ల‌ అమరప్రసాద్ రెడ్డి(45) అనే వ్య‌క్తి అక్క‌డిక‌క్క‌డే మృతి చెందాడు. వివ‌రాలు ఇలా ఉన్నాయి.. దామెరకు చెందిన అమ‌ర‌ప్ర‌సాద్‌రెడ్డి తన ద్విచక్ర వాహనంపై పెగడపల్లి డబ్బాల వైపు నుండి కేయూ ఫస్ట్ గేట్ వద్దకు వచ్చి యూ టర్న్ తీసుకుంటున్నాడు. అదే స‌మ‌యంలో కేయూ ఎక్స్ రోడ్డు నుండి పెగడపల్లి డబ్బాలు వైపు వెళ్తున్న బైకుపై వ‌స్తున్న భూక్యా జయంత్ అనే వ్య‌క్తి అమ‌ర‌ప్ర‌సాద్‌ను ఢీకొట్టాడు. ఈ ప్ర‌మాదంలో త‌ల‌కు బ‌ల‌మైన గాయం కావ‌డంతో అక్క‌డిక‌క్క‌డే మృతి చెందాడు. పోలీసులు అక్క‌డికి చేరుకుని మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి త‌ర‌లించి, కేసు ద‌ర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img