రేపు నర్సంపేటకు వస్తున్న వివిధ శాఖల మంత్రులను అడ్డుకొని తీరుతాము
అక్షరశక్తి, నర్సంపేట: రేపు నర్సంపేట లో ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రారంభం చేయడానికి వస్తున్న మంత్రులను అడ్డుకొని నిరసన వెక్తం చెయ్యాలి అని వరంగల్ జిల్లా సర్పంచ్లకు పిలుపునిచ్చిన తిమ్మంపేట మాజీ సర్పంచ్ మోడెం విద్యాసాగర్. బిల్లులు చెల్లించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎలక్షన్ నిర్వహించాలని, సొంత డబ్బుతో పాటు, అప్పుతెచ్చి గ్రామాలల్లో పలు అభివృద్ధి పనులు చేశామని, బిల్లులు రాకా సర్పంచులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, బిల్లు చెల్లించి సర్పంచుల ఆత్మహత్యలను ఆపాలని అన్నారు. ఇప్పటి ప్రభుత్వం గతంలో మేము అధికారంలోకి వస్తే వెంటనే బిల్లు చెల్లిస్తామని మోసపూరితమైన వాగ్దానాలు చేసిందని. మంత్రి సీతక్క సర్పంచ్లను గత ప్రభుత్వం మోసం చేస్తోంది, మేము అధికారంలోకి వస్తే వెంటనే సర్పంచుల బిల్లులు చెల్లిస్తామని హామీలు ఇచారు. కాని ఇప్పుడు కనీసం స్పందన కూడా లేదని అన్నారు. మోసం చేసి అధికారంలోకి వచ్చిన రేవంత్ ప్రభుత్వం సర్పంచ్ల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తంచేసారు. ఇప్పటికైనా సోయి తెచ్చుకొని సర్పంచ్ల పెండింగ్ బిల్లులు చెల్లించి స్థానిక సంస్థ ఎలక్షన్ నిర్వహిస్తే బాగుంటుందని, లేకుంటే తగిన గుణపాఠం చెప్తామని హచ్చరిచారు.