ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి
దెబ్బ తిన్న పంటన పరిశీలన
అక్షరశక్తి, నర్సంపేట : అకాల వర్షంతో పంట నష్టపోయిన రైతులకు అండగా ఉంటామని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి తెలిపారు. మంగళవారం రాత్రి కురిసిన భారీ వడంగడ్ల వానతో నియోజకవర్గంలో బీభత్సం సృష్టించింది. నర్సంపేట రూరల్ మండలంలోని ఇటుకాలపల్లి, ఏనుగుల తండా, కొండ సముద్రం తండాలతో పాటు చుట్టు ప్రక్కల ఉన్న పలు తండాల్లో గత రాత్రి నుండి కురిస్తున్న వడగండ్ల వర్షానికి మొక్కజొన్న, మిర్చి పంటలు దెబ్బతిన్నాయి. ఆ పంటలను, కూలిన ఇండ్లను పరిశీలించారు.
సహాయక చర్యల నిమిత్తం తక్షణమే అధికారులతో ఫోన్లో మాట్లాడారు. అర్ధరాత్రి వరకు మెలకవుగా ఉంటూ ఎన్నో శాఖల అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నష్టపోయిన రైతుల కుటుంబాలకు అండగా ఉంటామని, పకృతి ప్రకోపానికి దెబ్బతిన్న రైతన్న పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకెల్లి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట నర్సంపేట ఆర్డీవో, ఎంపీపీ, ఎంపీటీసీ, సర్పంచ్, ఇతర ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరులున్నారు.