Saturday, July 27, 2024

మావోయిస్టు సానుభూతిప‌రుల అరెస్టు

Must Read

అక్ష‌ర‌శ‌క్తి, ములుగు : సిపిఐ మావోయిస్టు సానుభూతిపరులను అరెస్టు చేసిన‌ట్లు ములుగు జిల్లా ఎస్పీ గౌస్‌ ఆలం తెలిపారు. సోమ‌వారం సాయంత్రం 5:30 గంటలకు వాహన తనిఖీ చేస్తున్నప్పుడు విశ్వసనీయ సమాచారం మేర‌కు వెంకటాపురం మండలం రామచంద్రాపురం గ్రామ శివారులో ములుగు పోలీసులు కారు, బైక్‌పై ప్రయాణిస్తున్న ఐదుగురిని పట్టుకున్నారు. పేలుడు పదార్థాలు, ఐఈడీ మెటీరియల్‌లోని లోహ భాగాలు, సీపీఐ(మావోయిస్ట్) పార్టీ విప్లవ సాహిత్యంతో పాటు కొన్ని మందులను పోలీసులు గుర్తించారు. నిందితులను విచారించగా, కొంత కాలం క్రితం ఇతర నిందితులతో కలిసి నిషేధిత సీపీఐని కలిశామని చెప్పారు. మావోయిస్టు గ్రూపు ప్రధాన నాయకుడు దామోద‌ర్, కొంతమంది దళ సభ్యులు తమ భూ సమస్యలను పరిష్కరించడం కోసం నిషేధించబడిన సీపీఐ మావోయిస్టు గ్రూపు విప్లవ భావజాలానికి ఆకర్షితులయ్యారు.

నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీ నేత దామోద‌ర్ సూచనల మేరకు నిందితులు కొన్ని పేలుడు పదార్థాలు, విప్లవ సాహిత్యం, మందులను సేకరించి వారికి ఇచ్చేందుకు ముందుకొచ్చారు. కూంబింగ్ ఆపరేషన్ల కోసం అడవికి వచ్చిన పోలీసులను చంపాలనే ఉద్దేశ్యంతో దామోద‌ర్‌ ప్రణాళిక వేశారని ఎస్పీ వెల్ల‌డించారు. అరెస్టయిన వారిలో అందె రవి( నాగారం గ్రామం, జయశంకర్ భూపాలపల్లి మండలం), శ్రీరామోజు మనోజు(పల్లారుగుడ గ్రామం, వరంగల్ జిల్లా, సంగెం మండలం), దిడ్డి సత్యం(దీక్షకుంట గ్రామం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా), శ్రీరామోజు భిక్షపతి( పల్లారుగుడ గ్రామం, వరంగల్ జిల్లా, సంగెం మండలం), అనసూరి రాంబాబు(పెద్దతండా గ్రామం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మల్హారరావు మండలం), ఘనపురం చంద్రమౌళి(బాలాజీ నగర్, జవహర్ నగర్ పీఎస్‌, కాప్రా మండలం, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా), ఘనపురం పృథ్వీ రాజ్ (బాలాజీ నగర్, జవహర్ నగర్ పీఎస్‌, కాప్రా మండలం, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా), అందె మానస(నాగారం గ్రామం, జయశంకర్ భూపాలపల్లి మండలం, జిల్లా) ఉన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img