యజమానికి శునకం షాక్
అక్షరశక్తి, నర్సంపేట: వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం నాచినపల్లి గ్రామంలో యజమానికి ఓ కుక్క ఊహించని షాక్ ఇచ్చింది. తన యజమాని దాచుకున్న 1.50 లక్షల నగదు సంచిని ఎత్తుకెళ్లి ఎక్కడో పడేసింది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన కాసు చేరాలు గొర్రెల కాపారి. ఆయన కుక్కను పెంచుకుంటున్నాడు. చేరాలు తాను సంపాదించుకున్న రూ.1.50 లక్షలను జోలె సంచిలో దాచుకున్నాడు. ఈనెల 25న నడుముకు కట్టుకున్న సంచిని తీసి మంచంపై పెట్టి సాన్నానికి వెళ్లాడు. తిరిగి వచ్చే సరికి మంచం వద్ద ఉన్న పెంపుడు కుక్క లేకపోగా జోలె సంచి కూడా కన్పించకపోవడంతో చేరాలు ఖంగుతిన్నాడు. కుక్క కోసం వెతగ్గా, కొన్ని గంటల తర్వాత వచ్చింది. కుక్కనే సంచి ఎత్తుకెళ్లిందని రెండు రోజుల పాటు ఆరా తీశారు. అంతేకాదు ఎవరికైనా దొరికితే తనకు అప్పగించాలని బాధితుడు చేరాలు వాట్సాప్ గ్రూప్లో పోస్టు చేయడం గమనార్హం.
Must Read