- నలుగురు కలిసి ఓ వ్యక్తిని హత్య చేసిన వైనం
- ఎంజీఎంలో చికిత్స పొందుతూ మృతి
అక్షరశక్తి, వరంగల్ : తాగిన మైకంలో నలుగురు కలిసి ఓ వ్యక్తిని హత్య చేసిన ఘటన ఆదివారం అర్థరాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వరంగల్ లక్ష్మీపురం బస్టాండ్ సమీపంలోని వెంకటరమణ బార్ వెనకాల ప్రాంతంలో కొందరు వ్యక్తులు మద్యం తాగారు. ఈ క్రమంలో వారి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. నలుగురు వ్యక్తులు తాగిన మైకంలో యాకయ్య అనే వ్యక్తిని బండరాయితో కొట్టి చంపినట్లు తెలుస్తోంది. బస్టాండ్ ప్రాంతం నుంచి ఇళ్లకు వెళ్తున్న కొందరు దాడిని గమనించి 108కి సమాచారం ఇచ్చారు. సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని యాకయ్యను ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందినట్టు తెలుస్తోంది. కాగా, ఏసీపీ గిరిధర్ ఆధ్వర్యంలో ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపడుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.