వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్
అక్షరశక్తి, హన్మకొండ క్రైం : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎనిమిది మంది పోలీస్ కానిస్టేబుళ్లపై ఆరోపణలు రావడంతో వారిని మహబూబాబాద్ జిల్లాకు అటాచ్ చేసినట్లుగా వివిధ వాట్సాప్ గ్రూపులో జరుగుతున్న ప్రచారం అవాస్తమని సీపీ రంగనాథ్ స్పష్టం చేశారు. ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవంలేదని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గతంలో కొద్ది మంది మహిళా కానిస్టేబుళ్లు వరంగల్ కమిషనరేట్కు బదిలీ కావడంతో వారి స్థానంలో ప్రస్తుతం వెలుబడిన ఉత్తర్వుల మేరకు ఎనిమిది మంది కానిస్టేబుళ్లను మహబూబాబాద్ జిల్లా ఎస్పీకి అటాచ్ చేసిన్నట్లు తెలిపారు. ఈమేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేశామని అన్నారు. అంతేకానీ సదరు కానిస్టేబుళ్లపై ఆరోపణలతో అటాచ్ చేసినట్లుగా వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని, మీడియా మిత్రులు గమనించాలని సీపీ కోరారు.
Must Read