అక్షరశక్తి, జనగామ క్రైమ్ : జనగామ జిల్లాలో విషాదం నెలకొంది. జనగామ ఎస్సై కాసార్ల శ్రీనివాస్ భార్య స్వరూప ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న ఎస్సై కాసార్ల శ్రీనివాస్ గదిలోకి వెళ్లి గన్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. 35 ఏళ్ల క్రితం జగిత్యాల జిల్లా జమ్మికుంట ప్రాంతానికి చెందిన స్వరూపను గోదావరిఖని చెందిన కానిస్టేబుల్ గా పనిచేస్తున్న శ్రీనివాస్ కు ఇచ్చి వివాహం చేశారు . అప్పటినుండి దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగి ఇద్దరు కుమారుల తో జీవనం సాగిస్తూ కానిస్టేబుల్ నుండి ఎస్ఐగా ప్రమోషన్ పొందారు.
జనగామలో ఎస్సైగా బాధ్యతలు చేసి కొంతకాలం స్టేషన్ ఘన్పూర్ ఎస్సైగా పనిచేసే మళ్లీ జనగామ ఎస్ఐగా బాధ్యతలు చేపట్టారు. ‘మూడు నెలల క్రితం శ్రీనివాస్ పెద్ద కుమారుడు రవితేజ వివాహం చేశారు .కుటుంబంలో ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ గురువారం మాత్రం భార్య స్వరూప ఐదు గంటల ప్రాంతంలో బాత్రూంలో చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే, ఈ ఘటనపై జనగామ జిల్లా పోలీసులు ఎంక్వయిరీ చేస్తుండగానే బాత్రూం వస్తుందని సర్వీస్ రివాల్వర్ తీసుకెళ్లి బాత్రూంలో కాల్చుకొని ఎస్సై శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో జనగామలో విషాదం నెలకొంది. పెద్ద సంఖ్యలో జనం చేరుకున్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.