30 మంది విద్యార్థులకు గాయాలు
అక్షరశక్తి, తొర్రూరు: మహబూబాబాద్ జిల్లాలో స్కూల్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 30 మంది విద్యార్థులు గాయపడ్డారు. స్థానికుల కథనం మేరకు.. తొర్రూరు పట్టణ కేంద్రానికి చెందిన శ్రీ నలంద పాఠశాల బస్సు దంతాలపల్లి మండలంలోని బొడ్లాడ గ్రామంలో విద్యార్థులను తీసుకురావడానికి వెళుతుండగా మండలం కేంద్ర శివారులోని మలుపు వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాద సమ యంలో బస్సులో 30 మంది విద్యార్థులు ఉన్నారు. వీరంతా స్వల్పగాయాలతో బయటపడ్డారు. డ్రైవర్ అతివేగం వల్ల బోల్తా కొట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నాడు.
Must Read