అక్షరశక్తి, హసన్ పర్తి : హసన్పర్తి మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మేకల వంశవేదిక ఆధ్వర్యంలో మేకల వంశస్థులు విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. మేకల వంశవేదిక అధ్యక్షులు యుగేంధర్ అధ్యక్షతన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీఐ జవాజీ సురేష్ హాజరై మాట్లాడుతూ… విద్యార్థులను ప్రతిభావంతులుగా తయారు చేసేది ఉపాద్యాయులేనని అన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రన్సిపాల్ చాడ సుదర్శన్ రెడ్డి, కార్పొరేటర్ గురుమూర్తి శివకుమార్, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు పాపిశెట్టి శ్రీధర్, కాంగ్రెసు పార్టీ డివిజన్ అధ్యక్షులు కానిపర్తి కిరణ్, బీజేపీ డివిజన్ అధ్యక్షులు మారం తిరుపతి, మేకల వారి వంశ వేదిక ప్రదాన కార్యదర్శి హరిశంకర్, ఉపాధ్యక్షులు ఆనంద్, రమేష్, శోభన్, సహ ప్రధాన కార్యదర్శి రాజేందర్, కార్యదర్శి సిద్దార్థ, కార్యవర్గ సభ్యులు సురేష్, సభ్యులు కన్నయ్య, కమిటీ సభ్యులు తిరుపతి, వేణు, కమలాకర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.