Monday, September 16, 2024

వంగపహాడ్ ఎస్సీ కాలనీలో తీరిన క‌రెంట్ స‌మ‌స్య

Must Read

అక్షరశక్తి, హ‌సన్ పర్తి : వ‌ర్ధ‌న్న‌పేట ఎమ్మెల్యే కేఆర్ నాగ‌రాజు చొర‌వ‌తో వంగ‌ప‌హాడ్ ఎస్సీ కాల‌నీలో క‌రెంట్ స‌మ‌స్య తీరింది. గత శనివారం ఎమ్మెల్యే వంగాపహాడ్‌లో ప‌ర్య‌టించిన సంద‌ర్భంగా ఎస్సీ కాలనీలో కరెంటు సమస్య ఉందని స్థానికులు చెప్పారు. వెంటనే స్పందించి సంబంధిత విద్యుత్ అధికారులతో మాట్లాడి లో వోల్టేజ్ సమస్య పరిష్కరించాల‌ని చెప్పారు.

విద్యుత్‌ సిబ్బంది బుధ‌వారం 15 కెవి ట్రాన్స్‌ఫార్మ‌ర్ మార్చి దాని స్థానంలో 25 కేవీ ట్రాన్స్‌ఫార్మ‌ర్ ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యేకు, అధికారుల‌కు కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు. డివిజన్ ప్రెసిడెంట్ పొన్నాల రఘు, మార్తా రవీందర్ పొలం అనిల్ రెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షులు రవీందర్, మాజీ కార్పొరేటర్ బానోత్ కల్పన కాంగ్రెస్ నాయకులకు కాలనీవాసులు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img