అక్షరశక్తి ములుగు: మావోయిస్టుల బంద్ నేపథ్యంలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ఏటూరు నాగారం ఏ ఎస్పి సూచనలతో ఏటూరు నాగారం సీఐ అనుముల శ్రీనివాస్, ఎస్సై తాజుద్దీన్ ఆధ్వర్యంలో ముమ్మరంగా వాహన తనిఖీలు చేపడుతున్నారు. గత రెండు రోజుల క్రితం భద్రాద్రి కొత్తగూడెం ములుగు జిల్లా గుండాల మండలం దామరతోగు సరిహద్దు అటవీ ప్రాంతాలలో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు దళ సభ్యుడు వృత్తి చెందిన విషయం తెలిసిందే. సోమవారం దామరతోగు ఎన్కౌంటర్ ను ఖండిస్తూ ములుగు. భూపాలపల్లి జిల్లాల బంద్ కు మావోయిస్టులు పిలుపునివ్వడంతో. అప్రమత్తమైన పోలీస్ యంత్రాంగం ఎప్పటికప్పుడు పోలీస్ బలగాలు మోహరించి విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. దామరతోగు ఎన్కౌంటర్ ను ఖండిస్తూ ములుగు, భూపాలపల్లి జిల్లాల బంద్ కు పిలుపునివ్వడం వలన మావోయిస్టులు ప్రతీకార చర్యలకు పాల్పడే అవకాశం ఉండడంతో పోలీసు బలగాలు ముమ్మరంగా వాహన తనిఖీలు చేపడుతున్నారు. ఈ కార్యక్రమంలో ఏటూరు నాగారం. ఎస్సై తాజుద్దీన్. సివిల్. సిఆర్పిఏఫ్ పోలీసులు సిబ్బంది పాల్గొన్నారు.