అక్షరశక్తి వరంగల్: గురువారం జిల్లా కలెక్టరేట్ సత్య శారద సమావేశ మందిరంలో కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ఈనగాల వెంకట్రామి రెడ్డి, వైస్ చైర్ పర్సన్ డాక్టర్ అశ్విని తానాజీ వాఖడే, అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణిలతో కలిసి ఇన్నర్ రింగ్ రోడ్ కొరకు భూములు తీసుకొన్న రైతులకు పరిహారం చెల్లింపు, క్రీడానగరం ఏర్పాటుకు భూగుర్తింపు పై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇన్నర్ రింగ్ రోడ్డు కు భూములు ఇచ్చిన
తిమ్మాపూర్, ఖిలా వరంగల్ గొర్రెకుంట ఏనుమాముల రైతులకు త్వరితంగా పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని రెవిన్యూ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వరంగల్లో స్పోర్ట్స్ స్టేడియం క్రీడా నగరం ఏర్పాటు చేయుటకు గాను నగర పరిసరాల్లో 50 నుండి 100 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించాలని ఆర్ డి ఓ కు సూచించారు. కూడా చైర్మన్ ఈనగాల వెంకట్రామి రెడ్డి మాట్లాడుతూ వరంగల్ కొరకు స్పోర్ట్స్ స్టేడియం ఆవశ్యకత ఎంతైనా ఉందని, అదేవిధంగా వరంగల్ నగరం పరిసరాల్లో క్రీడా నగర్ ఏర్పాటుకు ప్రభుత్వ భూమిని గుర్తించాలని కోరారు. ఈ సమావేశంలో ఆర్డీవో కృష్ణవేణి, కుడా పిఓ అజిత్ రెడ్డి, ఈఈ భీమ్రావు, కలెక్టరేట్ సూపరిన్టెండెంట్ చంద్రశేఖర్, తాసిల్దారులు నాగేశ్వరరావు, రియాజుద్దీన్, ఇక్బాల్ తదితరులు పాల్గొన్నారు.
ఇన్నర్ రింగ్ రోడ్ భూ నిర్వాసితులకు పరిహారం చెల్లించేలి – జిల్లా కలెక్టర్
Must Read