అక్షరశక్తి, వరంగల్ : ఖిలా వరంగల్ మండలం నాయుడు పెట్రోల్ పంపు సమీపంలో గురువారం ఉదయం ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన గడ్డల మధుకర్, వర్ధన్నపేటకు చెందిన గణేష్ గా గుర్తించారు.