అక్షరశక్తి, హసన్ పర్తి: హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండలంలోని ఎస్సార్ యూనివర్సిటీలో అగ్రికల్చర్ రెండో సంవత్సరం చదువుతున్న దీప్తి రాథోడ్ అనే విద్యార్థిని హాస్టల్లో ఉరివేసుకొని మృతి చెందింది. హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం అనంతసాగర్ ఎస్ఆర్ యూనివర్సిటీలో బీఎస్సీ అగ్రికల్చర్ రెండో సంవత్సరం చదువుతున్న దీప్తి రాథోడ్ హాస్టల్ గదిలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. విద్యార్థిని మృతి చెందిన విషయాన్ని హాస్టల్ యజమాన్యం కనీసం పోలీసులకు గాని ఇటు తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా ఎంజీఎం మార్చురీకి తరలించడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తోటి విద్యార్థులు అంటున్నారు. ఈ మధ్యకాలంలో పలు కళాశాలల్లో విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడుతున్న ఘటనలు తల్లిదండ్రులను తీవ్రంగా కలచివేస్తున్నాయి. దీప్తి రాథోడ్ మృతి పట్ల అనేక అనుమానాలు ఉన్నాయని విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు సమగ్ర విచారణకు డిమాండ్ చేస్తున్నారు.