Saturday, July 27, 2024

కూతురిని తనకు కాకుండా చేశాడని..

Must Read

 

  • అల్లుడిని అంత‌మొందించిన మామ‌!
  • తెలంగాణ‌లో మ‌రో ప‌రువు హ‌త్య‌?
    కూతురుని తనకు కాకుండా చేశాడనే అక్క‌సుతో అల్లుడిని అంత‌మొందించాడు ఓ మామ‌. సూర్యాపేటలో జ‌రిగిన ప్రణయ్ – అమృత ఉదంతాన్ని త‌ల‌పిస్తున్న ఈ ఘ‌ట‌న యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. వలిగొండ మండలంలోని లింగరాజుపల్లికి చెందిన రామకృష్ణ గౌడ్ మాజీ హోంగార్డ్. ఇతను హోంగార్డుగా పని చేసే సమయంలో యాదగిరిగుట్టకు చెందిన భార్గవి అనే యువతిని ప్రేమించి 2020లో పెళ్లి చేసుకున్నాడు. కొన్ని రోజుల పాటు లింగరాజుపల్లిలో ఈ దంపతులు జీవనం కొనసాగించారు. అనంతరం భార్గవి గర్భవతి కావడంతో భువనగిరి పట్టణంలో నివాసముంటున్నారు. 6 నెలల కిందే వీరికి ఒక పాప కూడా జన్మించింది. అయితే రామకృష్ణ గౌడ్ తుర్కపల్లిలో గుప్త నిధుల తవ్వకాల కేసులో సస్పెండ్ అయ్యాడు. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఈ నెల 15న బయటికి వెళ్లిన రామకృష్ణ గౌడ్ ఇంటికి తిరిగి రాలేదు. దీంతో ఆందోళనకు గురి అయిన అతని భార్య భార్గవి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే రామకృష్ణ మృతదేహాన్ని పోలీసులు సిద్దిపేట వద్ద గుర్తించారు. రామకృష్ణ మామనే కిడ్నాప్ చేసి హత్య చేయించినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

రామకృష్ణ భార్య భార్గవి తండ్రి పల్లెపాటి వెంకటేశ్ వీఆర్‌వో.. ప్రస్తుతం యాదగిరిగుట్ట పట్టణంలోనే ఉంటున్నాడు. అయితే తన కూతురుని తనకు కాకుండా చేశాడని రామకృష్ణపై అతడు పగ పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలోనే పలుమార్లు అల్లుడు, కూతురిపై దాడులకు కూడా తెగబడినట్లు తెలిసింది. ఈక్రమంలోనే రామకృష్ణను అంతమొందించేందుకు మామ ప‌థ‌కం ప‌న్నాడు. రియల్ ఎస్టేట్ వ్యవహారమని బ‌య‌ట‌కు రప్పించి కిరాయి గూండాల‌తో అల్లుడిని దారుణంగా హత్య చేయించిన‌ట్లు పోలీసులు భావిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img