మందుబాబులకు బ్యాడ్ న్యూస్. హైదరాబాద్లో రెండు రోజులపాటు మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. శనివారం సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు నగరంలోని వైన్స్ను మూసివేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించి మద్యం విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తప్పవని వారు హెచ్చరించారు.
శ్రీరామ నవమి పండుగ సందర్భంగా పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. శాంతి భద్రతల దృష్ట్యా 48 గంటల పాటు మద్యం అమ్మకాలపై నిషేధం విధించినట్లు పోలీసులు తెలిపారు. శ్రీరామనవమి సందర్భంగా…. శోభాయాత్రలు వంటివి ఉండటంతో మద్యం దుకాణాలను మూసి వేయాలని నిర్ణయించారు.