- వరంగల్ పశ్చిమ నుంచి టికెట్ ఆశించి భంగపాటు
- టికెట్ దక్కకపోవడంతో భావోద్వేగానికి గురై కంటతడి
- పొమ్మనలేక పొగపెట్టారంటూ ఆవేదన
- అక్షరశక్తి, హన్మకొండ: అక్షరశక్తి, హన్మకొండ: భారతీయ జనతా పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆపార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, యువనేత ఏనుగుల రాకేష్రెడ్డి బీజేపీకి రాజీనామా చేశారు. వరంగల్ పశ్చిమ నుంచి బీజేపీ టికెట్ ఆశించగా, పార్టీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మకు టికెట్ దక్కడంతో భంగపడిన రాకేష్రెడ్డి అధిష్టానంపై ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే అభిమానులు, అనుచరులతో కొంతకాలంగా చర్చలు జరిపారు. వారందరి సూచనల మేరకు రాకేష్రెడ్డి బీజేపీకి రాజీనామా చేశారు. ఈమేరకు బుధవారం హన్మకొండలోని హరిత హోటల్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. వరంగల్ వెస్ట్ టికెట్ రాకపోవడంతో భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. పొమ్మన లేక పొగ పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం కష్టపడిన తనకు టికెట్ ఇవ్వకపోగా కనీసం పలకరించడం లేదని విచారం వ్యక్తం చేశారు. దీంతో మనస్థాపం చెంది తన కార్యకర్తలతో కలిసి బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. యువకుడిగా, ఉన్నత విద్యావంతుడిగా, పార్టీలో క్రమశిక్షణ గల నాయకుడిగా పేరున్న రాకేష్రెడ్డి వరం గల్ పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ బలోపేతానికి తనవంతు కృషిచేశారు. అనేక సేవా కార్యక్రమాలు చేపట్టి యూత్లో మంచి ఫాలోయింగ్ సంపాదించారు. కాగా రాకేష్రెడ్డి రాజీనామా పార్టీలో కలకలంరేపగా, జిల్లాలో తీవ్ర చర్చనీయాంశం అయింది. త్వరలోనే ఆయన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది.
Must Read